Wednesday, May 15, 2024
- Advertisement -

తండ్రికి శిరీష్ ఏం అంకితం ఇచ్చాడో తెలుసా??

- Advertisement -

అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ (ఎబిసిడి)… మలయాళం లో పెద్ద విజయం సాదించిన ఈ చిత్రాన్ని తెలుగు లోకి రీమేక్ చేయనున్నాడు అల్లు శిరీష్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు విడుదల కానున్నది. ఈ సినిమా విడుదల సందర్భంగా సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర లో వచ్చిన ఈ మలయాళ సినిమా అప్పటిలో పెద్ద విజయం సాధించింది.

ఇప్పుడు అల్లు శిరీష్ తెలుగు లో కూడా ఈ విజయాన్ని రిపీట్ చేద్దాం అనే ఆశ తో వున్నాడు. అమెరికా నుండి వచ్చి ఇండియా లో ఇరుక్కుపోయిన ఒక కుర్రాడి కథ ఈ సినిమా లో మనం చూడవచ్చు. ఈ సినిమా లో నాగ బాబు అల్లు శిరీష్ కి తండ్రి పాత్ర లో చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో పాలుగొంటున్న అల్లు శిరీష్ ఈ సినిమా గురించి చెప్తూ ఈ సినిమా ని తన తండ్రి అల్లు అరవింద్ కి అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. అల్లు శిరీష్ కి డబ్బు విలువ తెలిసే లా చేసిన తన తండ్రి అల్లు అరవింద్ కి ఈ సినిమా అంకితం ఇస్తున్నట్లు అల్లు శిరీష్ చెప్పాడు. అలాగే తాను చదువుకునే రోజుల్లో ఏవైతే కష్టాలు పడ్డాడో ఈ సినిమా లో కూడా అటువంటివే వుంటాయి అని ఈ సినిమా కి బాగా రిలేట్ చేసుకున్నాను అని చెప్పిన శిరీష్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అభిమానులు తనను కచ్చితంగా ఆదరిస్తారు అనే నమ్మకాన్ని కూడా వెలిబుచ్చాడు.

రుక్సర్ మీర్ ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది. భరత్ ఈ సినిమా లో శిరీష్ కి స్నేహితుడి పాత్ర లో చేస్తున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తం గా ఈ సినిమా నిర్మిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -