యాంకర్ అనసూయ అటు బుల్లితెరతో పాటు ఇటు వెండితెర మీద కూడా తన హవాను కొనసాగుతుంది.ఇప్పటికే పలు సినిమాలలో నటించి తనలో యాంకరింగ్తో పాటు,నటన కూడా దాగి ఉందని నిరుపించుకుంది.రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మాత్తగా అనసూయ నటనకుగాను విమర్శకుల ప్రశంసలు కూడా అందాయి.ప్రస్తుతం అనసూయ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయాని సమాచారం.తాజాగా ఆమె మరో క్రేజీ ప్రొజెక్ట్లో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది.
విక్టరీ వెంకటేష్ ,వరుణ్ తేజ్ కాండినేషన్లో ఎఫ్-2 అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అనసూయ ఓ ఐటెం సాంగ్ చేయనుందని తెలుస్తుంది.ఈ సాంగ్ ఇద్దరి హీరోలతో కలిసి స్టెప్పులు వేయనుంది అనసూయ.గతంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా ఓ ఐటెం సాంగ్ చేసింది అనసూయ.ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా తమన్నా,మెహ్రీన్లు నటిస్తున్నారు.