యాంకర్ అనసూయ బుల్లితెరపై తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.వెండితెరపై కూడా తన హావను చూపిస్తుంది.క్షణం సినిమాతో తన నటనను ఫ్రేక్షకులకు పరిచియం చేసింది.ఈ సినిమాలో సిబిఐ ఆఫీసర్గా ఈమె నటనకు మంచి పేరు వచ్చింది.ఈ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అనసూయ పలు టీవీ షోలలో బిజిబిజిగా ఉంది. దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమాలో చాన్స్ కొట్టేసింది. మొదట ఈ సినిమాను నిరాకరించిన తరువాత ఓకే చెప్పింది. ఈ సినిమాలో అనసూయ రంగమ్మత్తగా కనిపించింది. ఈ సినిమాలో చరణ్ తరువాత మంచి పేరు వచ్చింది అనసూయ చేసిన రంగమ్మత్త క్యారెక్టర్కే. అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది.
పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నా అలా అనిపించదు అనసూయ ఫిజిక్ చూస్తే.అనసూయ సమ్మర్ వెకేషన్కు వెళ్లినట్లు ఉంది.అక్కడ ఫోటోలను తన అభిమానులకు కోసం సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.సముద్రపు ఒడ్డున బీచ్ లో అందమైన సన్ సెట్ లో దిగిన ఫొటోలు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆమె భర్తతో దిగిన ఒక ఫొటో అయితే ఎంతో రొమాంటిక్ గా ఉందని నెటిజన్స్ ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు.