యాంకర్ అనసూయ అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎంతో గుర్తింపు సంపాదించుకున్న యాంకరమ్మ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను సందడి చేస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా ప్రభావం వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు తమదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నారు.
ఈ క్రమంలోనే అనసూయ ఫేస్ బుక్ ద్వారా తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది ఎంతో మిస్ అవుతున్నానంటూ తెలిపారు. ఫేస్ బుక్ ద్వారా ఆట ఆడిన అనసూయ ఒక అభిమాని నుంచి ఒక ప్రశ్న ఎదురయ్యింది. మీకు ఆన్ లైన్ షాపింగ్ అంటే ఇష్టమా? లేదా ఇన్ పర్సన్ షాపింగ్ అంటే ఇష్టమా? అని అడగడంతో అందుకు అనసూయ స్పందిస్తూ…
Also read:టాలీవుడ్ను పక్కన పెట్టేసిన శ్రద్ధ శ్రీనాథ్.. నిజమేనా?
తనకి ఆన్ లైన్ షాపింగ్ అంటే ఏ మాత్రం ఇష్టం ఉండదని, తనకి ఇన్ పర్సన్ షాపింగ్ అంటేనే ఇష్టమని తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల వల్ల తనకెంతో ఇష్టమైన షాపింగ్ ను మిస్ అవుతున్నానని ఏకంగా ఏడుపు మొహం పెట్టి చెప్పేసారు. ఈ క్రమంలోనే అనసూయ ఏడుస్తూ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.