- Advertisement -
దివంగత నేత ఏపీ మాజీ సీఏం వైస్ రాజశేఖరరెడ్డి జీవిత కథను యాత్ర అనే పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు.మహి.వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటికి వచ్చింది.ఈ సినిమాలో రాజకీయ నాయకురాలిగా హాట్ యాంకర్ అనసూయ కనిపించనుంది.
అందుకు సంబంధించి లొకేషన్ లోని ఒక పిక్ ను ఆమె షేర్ చేసింది. కాకపోతే తాను పోషిస్తున్నది ఏ రాజకీయనాయకురాలి పాత్ర అనే విషయాన్ని మాత్రం ఆమె రివీల్ చేయలేదు. వై.ఎస్.పాదయాత్ర … ప్రజల ఆదరాభిమానాలు .. ప్రత్యర్థుల వ్యూహాలు .. వై.ఎస్.ప్రమాణ స్వీకారం మొదలైన అంశాలు ఈ బయోపిక్ లో వుంటాయని అంటున్నారు.రాజశేఖర్ రెడ్డి పాత్రలో మళయాళ సూపర్స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.సినిమాను వైఎస్ జగన్ పుట్టిన రోజున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.