తెలుగు బుల్లితెర హాట్ యాంకర్లలో అనసూయ ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లైన కూడా ఏమాత్రం తరగని అందం అనసూయ సొంతం. జబర్థస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన అనుసూయ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. ఇక అనసూయకు సినిమాలలో కూడా పలు అవకాశాలు రావడంతో అటు బుల్లితెరను,ఇటు వెండితెరను ఏలుతోంది.
రంగస్థలం సినిమాలో రంగమ్మాత్త క్యారెక్టర్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరువాత అనసూయకు పలు సినిమాలలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఎఫ్ 2 సినిమాలో కూడా తళుక్కున మెరిసింది ఈ భామ. తాజాగా అనసూయ ఓ సినిమాలో ఎమ్మెల్యే క్యారెక్టర్లో నటిస్తోంది. వైఎస్ఆర్ బయోపిక్ యాత్రలో సినిమాలో ఎమ్మెల్యేగా కనిపించనుంది.
ఇంతకి ఆమె ఎవరు పాత్రలో నటిస్తుందో తెలుసా..?. వైఎస్ఆర్ హయంలో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్ర రెడ్డి క్యారెక్టర్లో అనసూయ కనిపించనుంది. వైఎస్ఆర్ సబితాను చెల్లెలుగా భావించేవారు. మరి వైఎస్ బయోపిక్లో సబితా ఇంద్ర రెడ్డిని ఎలా చూపిస్తారో చూడాలి. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.
- కేబినెట్ సమావేశానికి మళ్లీ పవన్ గైర్హాజరు
- మరో పోరాటానికి సిద్దమైన వైసీపీ, ముహూర్తం ఫిక్స్..
- రంగనాథ్ను అరెస్ట్ చేయండి?
- విద్యార్థులకు మద్దతు.. సల్మాన్ ఖాన్ పై ట్రోల్స్..
- చీరలు కొనలేదని భర్తను కుక్కర్ మూతతో కొట్టి చంపిన భార్య!
