తెలుగు బుల్లితెర హాట్ యాంకర్లలో అనసూయ ఒకరు. ఇద్దరు పిల్లలకు తల్లైన కూడా ఏమాత్రం తరగని అందం అనసూయ సొంతం. జబర్థస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన అనుసూయ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. ఇక అనసూయకు సినిమాలలో కూడా పలు అవకాశాలు రావడంతో అటు బుల్లితెరను,ఇటు వెండితెరను ఏలుతోంది.
రంగస్థలం సినిమాలో రంగమ్మాత్త క్యారెక్టర్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తరువాత అనసూయకు పలు సినిమాలలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవలే ఎఫ్ 2 సినిమాలో కూడా తళుక్కున మెరిసింది ఈ భామ. తాజాగా అనసూయ ఓ సినిమాలో ఎమ్మెల్యే క్యారెక్టర్లో నటిస్తోంది. వైఎస్ఆర్ బయోపిక్ యాత్రలో సినిమాలో ఎమ్మెల్యేగా కనిపించనుంది.
ఇంతకి ఆమె ఎవరు పాత్రలో నటిస్తుందో తెలుసా..?. వైఎస్ఆర్ హయంలో మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్ర రెడ్డి క్యారెక్టర్లో అనసూయ కనిపించనుంది. వైఎస్ఆర్ సబితాను చెల్లెలుగా భావించేవారు. మరి వైఎస్ బయోపిక్లో సబితా ఇంద్ర రెడ్డిని ఎలా చూపిస్తారో చూడాలి. వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటిస్తుండగా.. ఆయన తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 8వ తేదీన విడుదల చేయనున్నారు.
- దళిత స్పీకర్ దూషణ, ఎర్రవల్లి ఘటనలపై సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం!
- NZ VS INS: హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న మ్యాచ్ టికెట్లు!
- అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ సభ్యులంతా సస్పెండ్!
- యువతపై కేసులా? చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం!
- బిగ్బాష్ లీగ్ పై ఐపీఎల్ ఓనర్ల కన్ను!
