బుల్లితెర నుంచి వచ్చి రెండు సినిమాలు తీసి ప్రశంసలు అందుకున్న దర్శకుడు ఓంకార్ ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై కనిపించనున్నట్టు సమాచారం వినిపిస్తోంది. గతంలో ‘ఆట’ అనే ఒక డాన్స్ రియాలిటీ షోతో అందది దృష్టిలో పడ్డాడు. అతడి నటన, స్పాంటినియస్, ప్రతిభ షోకు ప్రత్యేకత తీసుకువచ్చింది. ఆ షోతో అన్ని ఛానల్స్ కూడా ఆ షోలకు ప్రాముఖ్యం ఇచ్చాయి. ఇప్పుడు అన్ని చానల్స్లలో అలాంటి కార్యక్రమాలు వస్తున్నాయి. ఏది చేసిన ఓంకార్ ముద్ర మరచిపోలేనిది. షోస్లతో బిజీగా ఉన్న అతడు సడన్గా దర్శకుడిగా మారిపోయాడు. తమ్ముడితో తీసిన సినిమాతో సినీ పరిశ్రమ దృష్టిని ఆకట్టుకున్నాడు.
తొలి సినిమా రాజుగారి గదితోనే విజయం అందుకున్నాడు. తొలి సినిమాతో దర్శకత్వం చేపట్టి ఓంకార్ తన ప్రతిభతో సినిమా తీశాడు. ఆ తర్వాత గతేడాది అక్కినేని నాగార్జున, సమంతతో కలిసి రాజుగారి గది -2 సినిమా తీశాడు. అయితే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా క్రీడా సంబంధిత నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికన్నా ముందే మళ్లీ టీవీలో కనిపించనున్నట్టు సమాచారం. ఈలోపు స్టార్ మా చానల్ కోసం ఓంకార్ త్వరలో ఒక రియాలిటీ షో చేస్తున్నాడట.
తనకు జీవితం ఇచ్చిన టీవీకి మరోసారి పని చేయాలని చూస్తున్నాడు. శ్రీనివాస్తో తీసే సినిమాలోపు ఓ సీజన్ షో చేయాలని ప్లాన్లో ఉన్నాడు. ఆ విధంగా ఓంకార్ బిజీ అయ్యాడు. కొద్దిరోజుల్లో మీరు ఓంకార్ను టీవీ తెరపై చూసే అవకాశం ఉంది.