Tuesday, April 23, 2024
- Advertisement -

అంతా చూస్తుండగానే సుధీర్ ను చూస్తూ అలా చేసిన రష్మీ!

- Advertisement -

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న రష్మి అదే సోలో పాటిస్పేట్ చేసే సుడిగాలి సుదీర్ మధ్య ఉన్న లవ్ ట్రాక్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై ఎంతో క్రేజ్, పాపులారిటీని దక్కించుకున్న జంటలలో రష్మీ-సుధీర్ జంట ముందు వరుసలో ఉంటుంది. ఇక యూట్యూబ్ ఛానల్ లో వీరి వీడియోలకి ఉన్నన్ని లైక్స్, ఫాలోవర్స్ మరే వీడియోలకు ఉండదని చెప్పవచ్చు.

కెమెరా ముందు తెరపై రొమాంటిక్ సన్నివేశాలలో నటించే ఈ జంట లేనిదే ఏ కార్యక్రమం, ఏ ఈవెంట్ కూడా జరగదు. అంతలా గుర్తింపు సంపాదించుకున్న ఈ జంటపై ఎన్నో వార్తలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నిజంగానే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని ఎంతో మంది భావించారు. అయితే వీరి మధ్య జరిగే కెమిస్ట్రీ ఓన్లీ స్క్రీన్ మీదేనని, వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని పలుమార్లు ఈ జంట స్పష్టంగా చెప్పినప్పటికీ వీరిపై రూమర్లు మాత్రం ఆగడం లేదు. అందుకు గల కారణం వీరు చేసే రొమాంటిక్ స్కిట్ అని చెప్పవచ్చు.

Also read:మరోసారి ఆ ఖైదీకి భార్యగా నటించనున్న కాజల్..!

తాజాగా విడుదలైన ఢీ 13 ప్రోమోలో వీళ్లిద్దరి రొమాంటిక్ ట్రాక్ హైలైట్ అయింది. అందరూ చూస్తుండగానే రష్మీ రెచ్చిపోవడంతో అక్కడున్న వారందరూ ఎంతో షాక్ కి గురవ్వడమే కాకుండా ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఢీ షోకి జడ్జిగా వ్యవహరించే ప్రియమణి, పూర్ణ చూస్తుండగానే రష్మీ సుధీర్ కి కన్నుకొడుతూ, అతని వంక కసిగా చూస్తూ పెదాలు కొరుకుతూ పక్కకు రమ్మని పిలవడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. రష్మీ ఈవిధంగా పిల్చడంతో సుధీర్ కళ్ళల్లో చెప్పలేని ఆనందం కనబడుతోంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

Also read:డాక్టర్ల కోసం నాని స్పెషల్ ట్రీట్.. ఏమిటంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -