Monday, April 29, 2024
- Advertisement -

ఓటీటీలోకి వచ్చేసిన యానిమల్..

- Advertisement -

సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం యానిమల్. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు 3 గంటల రన్‌ టైంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తుండగా ఆ తరుణం వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో యానిమల్ స్ట్రీమింగ్ అవుతోంది.

యానిమల్ మూవీ వరల్డ్ వైడ్‌గా మొత్తంగా రూ. 915 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. 2023 సంవత్సరంలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా యానిమల్ నిలిచింది. బాబీ డియోల్ విలన్‌గా నటించగా చాలా ఏళ్ళ తర్వాత బాబీ డియోల్ కి డిమాండ్ పెరిగింది. ఈ సినిమాతో రణ్‌బీర్ కపూర్ క్రేజ్ డబుల్ కాగా రష్మికా కూడా బాలీవుడ్‌లో సత్తాచాటింది.

యానిమల్ సినిమా తర్వాత రష్మికాను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మికా ఫాలోవర్లు 40 మిలియన్లకి చేరింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కన్నడ భామ కొద్దికాలంలోనే అగ్రహీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -