అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ వంగా తెరకెక్కిన చిత్రం యానిమల్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు,హిందీ,తమిళం,కన్నడ,మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా టి సిరీస్ – భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.
తాజాగా ఈ సినిమా రన్టైం వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు మేకర్స్. ఈ మూవీ రన్ టైంని 201 నిముషాలు (3 గం. ల 21 ని. లు)గా లాక్ చేయగా ఏ సర్టిఫికెట్ని అందించారు. కేవలం అడల్ట్స్ మాత్రమే చూసే చిత్రం అని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఎంత వయోలెన్స్గా ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రణబీర్ సరసన రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్, రష్మికా లుక్స్కి అద్భుత స్పందన వచ్చింది. ఇక రణబీర్ – రష్మికా కెమిస్ట్రీ అదుర్స్. అనిల్ కపూర్ బాబీ డియోల్, త్రిప్తి డిమ్రీ వంటి స్టార్లు నటిస్తున్నారు.