Thursday, May 2, 2024
- Advertisement -

మ‌రో వివాదంలో చిక్కుకున్న కీర్తి సురేష్‌

- Advertisement -

అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ‌ను మ‌హ‌న‌టి సినిమాగా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.సావిత్రి పాత్ర‌లో కీర్తి సురేష్ న‌టించింది.ఈ సినిమా సూప‌ర్ హిట్‌గా నిలిచింది.సావిత్రి జీవితంలోని చూసిన ఎత్తుపల్లాలన్నింటినీ సజీవంగా కళ్లముందు నిలిపారు. సావిత్రిగా కీర్తి సురేష్ నటన అద్భుతంగా ఉందనే గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది.

అయితే ఈ సినిమా వివాదంలో చిక్కుకుంద‌ని స‌మాచారం. ఇప్పటికే జెమినీ గణేశన్ పెద్ద భార్య కుమార్తె తన తండ్రి గురించి తప్పుగా చూపించారంటూ ఫైరయింది.తాజాగా సావిత్రి పెదనాన్న పాత్ర‌ను సినిమాలో మంచిగా చూపించార‌ని,నిజ జీవితంలో ఆయ‌న అంత మంచివాడు కాద‌ని,సావిత్రికి మందు అల‌వాటు చేసింది ఆయ‌నేన‌ని ఆరోపించింది, సావిత్రి పెదనాన్న సోదరుడి మనవరాలు విజయ.దీంతోపాటు సావిత్రి కుమార్తె చాముండేశ్వరి తీరును విజయ తప్పుపట్టింది.

సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్నప్పుడు ఆస్తి కోసం కన్నతల్లిపైనే కేసు వేసి కోర్టుకు లాగిందని.. తల్లి చివరి రోజుల్లో ఆమెను పట్టించుకోనే లేదంటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను సావిత్రి కుమార్తె చాముండేశ్వరి వద్ద ప్రస్తావిస్తే తనకు తెలియని వ్యక్తులు చేసే కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కొట్టిపారేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -