Saturday, May 4, 2024
- Advertisement -

అను ఎమ్మాన్యుయ‌ల్ అలా అనేసింది ఏంటబ్బా..!

- Advertisement -

హీరో అను ఇమ్మాన్యుయేల్ మ‌జ్ను సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచియ‌మైంది.ఈ సినిమా త‌రువాత వ‌ర‌స సినిమాల‌లో అవ‌కాశాలు చేజిక్కిచుకుంది. పెద్ద సినిమాల‌లో అవ‌కాశాలు అయితే వ‌స్తున్నాయి కాని అవ‌న్ని బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ కావ‌డంతో అను రేసులో బాగా వెన‌క‌ప‌డిపోయింది.నా పేరు సూర్య‌,అజ్ఞాత‌వాసి,ఆక్సిజ‌న్ ఇలా అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.దీంతోపాటు ఆమె వ్య‌క్తిగ‌త సమ‌స్యల‌తో కూడా అను బాగా ఇబ్బంది ప‌డి కొన్ని సినిమాల‌ను కూడా వ‌దులుకుంది.ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ‘శైలజా రెడ్డి’ అల్లుడు సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.

మారుతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా అత్త పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. అను ఎమ్మాన్యుయల్ ఫ్యాషన్ రంగంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.నా చిన్నప్పుడు మాధురి దీక్షిత్, శ్రీదేవిలను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. వాళ్లను ఎప్పుడు చూసిన కొత్తగానే కనిపించేవారు. ఇప్పుడు ఉన్న హీరోయిన్లు ఎవ‌రు నాకు పెద్ద‌గా న‌చ్చ‌డం లేద‌ని,ఫ్యాష‌న్ పేరుతో వెర్రీగా త‌య్యారు అవుతున్నార‌ని అను ఇమ్మాన్యుయేల్ అభిప్రాయ‌ప‌డింది.అసలే సినిమాలు లేక ఇబ్బంది ప‌డుతున్న అను ఇలాంటి కామెంట్స్ చేసింది ఏంటా అని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -