Thursday, May 9, 2024
- Advertisement -

నాకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వ‌లేదు అంటున్న హీరోయిన్

- Advertisement -

తమిళం లో పెద్ద విజయం సాధించిన సినిమా రట్సాసన్ ని తెలుగు లో రాక్షసుడు అనే పేరు తో రీమేక్ చేస్తున్నారు. మొదట ఈ రీమేక్ లో నితిన్ నటించాలి అని అనుకున్నాడు కానీ చివరికి ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి వెళ్ళింది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమా ఇప్పుడు ప్రమోషన్స్ దశ లో ఉంది. వచ్చే నెల రెండవ తేదీ న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్ణు విశాల్ పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించగా,అమల పాల్ చేసిన హీరోయిన్ పాత్ర ని తెలుగు లో అనుపమ పరమేశ్వరన్ చేసింది.

సాధారణం గా ఇలాంటి థ్రిల్లర్ తరహా సినిమాల్లో హీరోయిన్ కి ప్రాధాన్యత ఉంటే పూర్తి స్థాయి లో ఉంటుంది లేదంటె అస్సలు ఉండదు. నిజానికి ఈ సినిమా లో హీరోయిన్ పాత్ర ఎవరు చేసినా చెల్లుతుంది. కానీ అనుపమ మాత్రం ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక రీజన్ చెప్తుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగం గా మీడియా తో ముచ్చటిస్తూ వచ్చిన అనుపమ తను తన కెరీర్ లో ఇప్పటి వరకు టీచర్ రోల్ చేయలేదని, అందుకే ఈ సినిమా లో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండదు అని కూడా సెలవిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -