ప్రియాంక చోప్రా మాజీ మిస్ వరల్డ్ బాలీవుడ్లనే కాక ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సంపాదించుకుంది. 35 ఏళ్ల వయస్సులో కూడా ప్రియాంక తన అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల జాబితలో టాప్ ప్లేస్లో ఉండేది.కాని ఇప్పుడు ఈ భామ రేస్లో వెనకనడిందనే చెప్పాలి.కాని ఫ్రియాంక అందాల అరబోతకు ఎవరూ సాటి రారు అనేంతగా ఘాటు ఫోటోషూట్ లతో యువత మతి పొగొడుతుంది. గతంలోనే ప్రియాంక గ్లామర్ షో పై కొన్ని వివాదాలు వచ్చాయి. వాటికి ప్రియాంక చోప్రా కాస్త సుతిమెత్తగానే రిప్లై ఇచ్చింది. తాను ఎలా కనిపించినా, ఏం చేసిన తన వృత్తి కోసమే అంటూ గతంలో జవాబు ఇచ్చింది. తాజాగా ఈ భామ మరో వివాదంలో చిక్కుకుంది.
అస్సాం టూరిజం కోసం ప్రియాంక చేసిన ఫోటో షూట్ తీవ్రమైన కాట్రవర్సీకి దారితీసింది. ఇప్పుడు ఈ చర్చే సర్వత్రా జరుగుతోంది.ప్రియాంకకు బాలీవుడ్లో అవకాశాలు రాకపోయిన హాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. అస్సాంలో బిజెపి ప్రభుత్వం ప్రియాంకను టూరిజం కొరకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. హద్దులు మీరుతున్న ప్రియాంక అందాల వ్యవహారం అస్సాం ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగుతున్నారు.దీనిపై ఇంత వరుకు అటు ప్రియాంక కాని ఇటు అస్సాం ప్రభుత్వంగాని స్పదించలేదు.