Monday, April 29, 2024
- Advertisement -

తమిళనాడులో అఖండ క్లైమాక్స్​..!

- Advertisement -

బాలయ్య, బోయపాటి కాంబినేషన్​లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అఖండ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్​రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బోయపాటి గత చిత్రాలు.. వినయవిధేయరామ, జయజానకి నాయక పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన ఎలాగైనా హిట్​ కొట్టాలని బాలకృష్ణతో ఈ ప్రాజెక్ట్​ ఓకే చేశారు. మరోవైపు బాలయ్య బాబు నటించిన కథానాయకుడు, మహానాయకుడు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బాలయ్య , బోయపాటి కాంబినేషన్​లో తెరకెక్కిన సింహా, లెజెండ్​ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో బాలయ్య .. ఫ్యాక్షనిస్టు, అఘోరాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ప్రగ్యా జైస్వాల్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. శ్రీకాంత్​, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్​ తమిళనాడులోని ఓ గుడిలో చిత్రీకరిస్తున్నారు. అక్కడ భారీ యాక్షన్​ సీక్వెన్స్​ తెరకెక్కిస్తున్నారు.

బాలయ్య డబుల్ రోల్ చేస్తుండటం.. బోయపాటి డైరెక్షన్​ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నాడు. తెలుగులో ఓ అగ్రహీరో ఇటువంటి పాత్ర ఒప్పుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అఖండ వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.

Also Read

5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం

దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్..!

నా బయోపిక్​ తీయకండి.. ప్లీజ్​

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -