బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అఖండ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మిర్యాల రవీందర్రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. బోయపాటి గత చిత్రాలు.. వినయవిధేయరామ, జయజానకి నాయక పెద్దగా ఆడలేదు. దీంతో ఆయన ఎలాగైనా హిట్ కొట్టాలని బాలకృష్ణతో ఈ ప్రాజెక్ట్ ఓకే చేశారు. మరోవైపు బాలయ్య బాబు నటించిన కథానాయకుడు, మహానాయకుడు కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. బాలయ్య , బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో అఖండపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమాలో బాలయ్య .. ఫ్యాక్షనిస్టు, అఘోరాగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇక ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ తమిళనాడులోని ఓ గుడిలో చిత్రీకరిస్తున్నారు. అక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.
బాలయ్య డబుల్ రోల్ చేస్తుండటం.. బోయపాటి డైరెక్షన్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బాలయ్య అఘోరాగా కనిపించబోతున్నాడు. తెలుగులో ఓ అగ్రహీరో ఇటువంటి పాత్ర ఒప్పుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అఖండ వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.
Also Read
5 పైసలకే బిర్యానీ.. ఎగబడ్డ జనం