గత నెలలో రోడ్డు ప్రమాదంలో మరణించారు నందమూరి హరికృష్ణ.ఆయన మరణంతో నందమూరి ఇంట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.హరికృష్ణ మరణానికి ముందు నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్న సంగతి అందరికి తెలిసిందే.హరికృష్ణ కుటుంబాన్ని అటు పార్టీలోను,ఇటు సినిమా ఇండస్ట్రీను దూరం పెడుతు వస్తున్నాడు హీరో బాలకృష్ణ.ఈ విషయాన్ని చాలాసార్లు బహిరంగంగానే విమర్శించారు హరికృష్ణ.ఇక ఎన్టీఆర్ను అయితే తన ఫ్యామిలీ ఫంక్షన్స్కు కూడా పిలవకుండా అవమానించాడు బాలకృష్ణ.అయితే హరికృష్ణ మరణం తరువాత నందమూరి కుటుంబం మొత్తం కలిసిపోయింది.బాలకృష్ణ ఎన్టీఆర్,కల్యాణ్ రామ్లతో మాట్లాడుతు తండ్రి లేని లోటుని తీరుస్తున్నాడు బాలయ్య.
వీరు ముగ్గురు కలిసి సరాదగా భోజనం చేస్తున్న వీడియో ఒకటి బయటికి కూడా వచ్చింది.ఇక నిన్న జరిగిన ఎన్టీఆర్ అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్పై బాలకృష్ణ స్పందించారు.ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం చాలా భావోద్వేగంతో సాగింది. తమ తండ్రిని గుర్తు చేసుకుంటు కల్యాణ్ రామ్,ఎన్టీఆర్ ఇద్దరు చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఎన్టీఆర్ ,కల్యాణ్ రామ్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.హరికృష్ణగారు లేకపోతే మీకు నేను ఉన్నాను కదా అంటూ వారికి భరోసా ఇచ్చారు బాలయ్య.ఇంకోసారి ఇలా తండ్రి లేడని బాధపడితే మాత్రం ఊరుకోనని ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ ఇద్దరిని హెచ్చరించాడట బాలయ్య.