Friday, May 10, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై దాడిని ‘అత‌డు’ సినిమాతో పోల్చిన బాల‌య్య‌?

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌పై నిన్న(గురువారం) దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం హత్యాయ‌త్నం జ‌రిగింది.విశాఖపట్నం విమానాశ్రయంలో జ‌గ‌న్‌పై దాడి జరిగింది. విమానాశ్రయం లాంజ్ లో కూర్చుని ఉండగా ఆయనపై గుర్తుతెలియ‌ని వ్యక్తి దాడి చేశాడు.ఈ దాడిలో జ‌గ‌న్ భూజానికి స్వ‌ల్ప గాయాలైయ్యాయి. అక్కేడ ప్ర‌ధ‌మ చికిత్స చేయించుకున్న జ‌గ‌న్ వైజాగ్‌ ఎయిర్ పోర్ట్ నుంచి హైద‌రాబాద్ బ‌య‌లుదేరి వ‌చ్చేశారు.జ‌గ‌న్ త‌న భూజానికి హైద‌రాబాద్‌లోనే చికిత్స చేయించుకున్నారు.అయితే జ‌గ‌న్‌పై దాడిని ఓ సినిమాతో పోల్చారు సినీ హీరో,టీడీపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌.

జ‌గ‌న్‌పై దాడిని మ‌హేశ్ బాబు న‌టించిన అత‌డు సినిమాతో పోల్చారు బాల‌య్య‌.ఈ సినిమాలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న రాజకీయ నాయ‌కుడు అధికారంలోకి రావ‌డానికి ఓ ప్లాన్ వేస్తాడు.త‌న‌పై దాడి చేయాల‌ని ,కాని ఆ దాడిలో నాకు ఏం కాకుడద‌ని ,కిరాయి హంత‌కుడిని మాట్లాడుకుంటాడు. జ‌గ‌న్‌పై దాడి కూడా అచ్చం ఆ సినిమాలాగే ఉంద‌ని బాల‌య్య త‌న స‌న్నిహితులతో చెప్పార‌ని స‌మాచారం. ఏది ఏమైన‌ప్ప‌టికి ఈ దాడిలో జ‌గ‌న్‌కు ఎటువంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -