Saturday, April 20, 2024
- Advertisement -

నటి బాబీ లహరీ కష్టాలు తెలిస్తే షాక్ అవుతారు?

- Advertisement -

బుల్లితెరపై బంగారు పంజరం,అంతఃపురం వంటి సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి బాబీ లహరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ పరంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈమె తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు బిడ్డల తల్లి అయ్యింది. అయితే తన రెండవ కూతురు అను పుట్టిన తర్వాత ఆమె అనారోగ్యం పాలవడంతో తన అనుకున్నవాళ్లే తన కూతురిని ఎక్కడైనా విడిచిపెట్టి వద్దామని చెప్పినప్పుడు తనకు తన వాళ్ళ కన్నా తన కన్న ప్రేమే ముఖ్యం అనిపించింది. అందుకోసమే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని సైతం వదులుకొని తన బిడ్డ ఆలనా పాలనా చూసుకుంటూ ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు.

కెరీర్ పరంగా మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఆమె నిజ జీవితంలో ఓడిపోయింది. అందరూ ఉన్న ఒంటరిగా, తన ఇద్దరి కూతుర్లతో పోరాటం చేస్తోంది. ఈ తల్లి పోరాటం ముందు తన బిడ్డ వైకల్యం కూడా ఓడిపోయింది. బిడ్డ వైకల్యం చూసి భర్త అత్తమామలు తల్లిదండ్రులు చీదరించుకున్నా తనే నా ఏంజెల్ అంటూ ఆ తల్లి మురిసిపోయింది. తాను బతకడం కాదు తన కూతుర్ని బతికించుకోవాలని 14 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తోంది.

Also read:త్వరలోనే శివతో సూర్య సినిమా.. ఎప్పుడొస్తుందంటే?

అందరూ ఉన్నప్పటికీ అందరికీ దూరమై ఒంటరిగానే మిగిలిపోయిన లహరి గత 14 సంవత్సరాల నుంచి ఎంతో మనో వేదనను అనుభవిస్తున్నారు. ఆమె బాధ వర్ణనాతీతం.ఎంతో ఆరోగ్యంగా పుట్టిన తన బిడ్డను కేవలం కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు డబ్బుల కోసం తనను ఇరవై తొమ్మిది రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచి,తనకు అనవసరమైన ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా తన కూతురు పరిస్థితి ఈ విధంగా మారిందని కార్పొరేట్ ఆసుపత్రులపై వారు చేసే మాఫియా పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రతి తల్లి తండ్రి తన బిడ్డకు డాక్టర్లు ఏ విధమైనటువంటి చికిత్స అందిస్తున్నారో తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరం ఉందని, అప్పుడే నేను పడుతున్న బాధ ఏ తల్లి పడదని ఈ సందర్భంగా నటి లహరి తన ఆవేదనను వ్యక్తం చేశారు.

Also read:టీచర్ జాబ్ సంపాదించిన మలయాళ బ్యూటీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -