Monday, May 6, 2024
- Advertisement -

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కు భీమ్లా నాయక్ టీం శుభవార్త చెప్పింది. ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో వాయిదా పడిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు అయింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించి ఈ చిత్రం ఫిబ్రవరి 25న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

ప్రపంచవ్యాప్తంగా సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. సోమవారం చిత్ర ప్రీ – రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని తలపెట్టినా.. దాన్ని వాయిదా వేశారు. ఇప్పుడా ఈవెంట్ ను బుధవారం నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సాయంత్రం ఆరున్నరకు యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తామని పోస్టర్ విడుదల చేశారు.

‘భీమ్లా నాయక్’ సినిమా ప్రీ – రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారక రామారావు రావాల్సి ఉంది. వీరితో పాటు మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ వేడుకలో పాల్గొనాల్సి ఉంది. దీనిపై నిర్మాణసంస్థ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికేట్ దక్కించుకుంది.

మరో సారి రెచ్చిపోబోతున్న నట సింహం

దేవ కన్యలా సమంత

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -