ప్రస్తుతం ఉన్న కరోనా విపత్కర పరిస్థితులలో ఆస్పత్రిలో సరైన మౌలిక వసతులు లేక ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి సరైన సమయంలో వైద్యం అందక రోజుకు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు తమ వంతు సాయంగా కరోనా బాధితులకు సహాయం చేస్తున్నారు. అలాగే మరికొందరు సెలబ్రిటీలు ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించాలనే ఉద్దేశ్యంతో అమితాబ్ ఏకంగా 1.75 కోట్ల విలువ చేసే అత్యాధునిక వెంటిలేటర్లు, మానిటర్లు, వైద్య పరికరాలను ముంబైలోని సియాన్లో గల లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆస్పత్రికి అందజేశారు.
Also read:పాపం.. ఆ నటుడుకి డైరెక్టర్ వంశి జీవితంపై విరక్తి కలిగించాడట!
ఈ విధంగా అత్యవసర సమయంలో ఉపయోగపడే వైద్య పరికరాలను లోకమాన్య తిలక్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రికి ఇచ్చినట్లు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు.