బిగ్బా స్ రెండో సీజన్ చివరి దశకు చేరుకుంది.షో మరో రెండు వారల్లో ముగియనుండటంతో ఎలిమినేషన్స్పై అందరికి ఆసక్తి పెరిగింది.ఇక వారం ఎలిమినేషన్లో నలుగురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు పోటీ పడబోతున్నారు. సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అమిత్, శ్యామల, దీప్తిలు ఎలిమినేట్కు నామినేట్ అయ్యారు.మర్డర్ టాస్క్లో భాగంగా గీతా మాధురి ఈ సీజన్ మొత్తం కౌశల్ను ఎలిమినేషన్కు నేరుగా నామినేట్ చేసింది.వీరి నలుగురిలో ఎవరు బిగ్బాస్ నుంచి బయటకి వెళ్లబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.
కౌశల్కి బయట సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉండటంతో ఈ వారం కూడా కౌశల్ సేఫ్ అవుతాడని అందరు భావిస్తున్నారు.మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ లో దీప్తికి, శ్యామలకి ప్రేక్షకుల్లో కాస్త ఫాలోయింగ్ ఏర్పడింది కాబట్టి ఈ వారం అమిత్ బయటకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈ వారం కూడా నాని డబల్ ఎలిమినేషన్ అంటే కనుక దీప్తి,శ్యామలలో ఎవరో ఒకరు బయటికి రావడం ఖాయం.మరి ఈ నలుగురిలో ఎవరు బయటికి వస్తారో చూడాలి.