తెలుగు బిగ్బాస్ రెండో సీజన్లో ప్రేమకథలు ఎక్కువైయ్యాయి.షో మొదటి నుండి హోస్లో లవ్ స్టోరీలు నడుస్తునే ఉన్నాయి. తొలుత తేజస్వితో ప్రేమాయణం సాగించాడు సామ్రాట్. హౌస్ లో వీరిద్దరూ కలిసి ఉండడం, ఒకరినొకరు ప్రేమగా హగ్ చేసుకోవడం వంటి విషయాలు వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే అనుమానాలు వచ్చాయి.అయితే బయటికి వచ్చిన తేజస్వీ ..సామ్రాట్ నేను ఫ్రెండ్స్ మాత్రమేనంటూ చెప్పుకొచ్చింది.ఇక తనీష్ ఇద్దరితో వ్యవహరం నడిపిన సంగతి చూస్తునే ఉన్నాం.దీప్తి సునైనా తనీష్ల మధ్య ఏదో జరుగుతుందని బయట ఉన్న వారితో పాటు లోపల ఉన్న హోస్మెట్స్కు కూడా అనుమానంగానే ఉంది.
వీరిద్దరు కలిసి అర్థరాత్రి కలుసుకోవడం,మాట్లాడుకోవడం,హగ్ చేసుకోవడం చూసిన హోస్ట్ నాని కూడా వీరిని ప్రశ్నించాడు.దీంతో దీప్తికి కొంచెం దూరంగా ఉండలని డిసైడ్ అయ్యాడు తనీష్.ఆలోపే అతనికి మరో భామ దగ్గరైంది.తనీష్ హీరోయిన్ నందినితో క్లోజ్గా ఉండటం మొదలు పెట్టాడు.వీరిద్దరు అర్థరాత్రి లేచి హగ్ చేసుకోవడం కెమెరా కంట పడింది.నందిని షో నుండి ఎలిమినేట్ అయిన తరువాత తనీష్ మళ్లీ దీప్తితో క్లోజ్గా ఉంటు ఆమెకు సపోర్టు చేస్తు వస్తున్నాడు.ఇక తాజాగా హోస్లో మరో ప్రేమకథ మొదలైనట్లు తెలుస్తుంది.గీతామాధురి, సామ్రాట్ ల ప్రవర్తనలో మార్పులు చోటు చేసుకున్నాయి. వీరి మధ్య ఏదో జరుగుతుందనే రూమర్లు మొదలయ్యాయి.
గత రెండు, మూడు రోజులుగా వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతున్నారు. రోజురోజుకి ఆ క్లోజ్ నెస్ కాస్త పెరుగుతూ వస్తోంది. మొన్నటి ఎపిసోడ్ లో గీతా-సామ్రాట్ ల మధ్య చూపుల యుద్ధం జరిగింది. ఈయన నాకు బాగా క్లోజ్ అయిపోతున్నారు అంటూ శ్యామలకి చెబుతూ సామ్రాట్ చేతిని పట్టుకొని కూర్చుంది గీత.నా ఫ్రెండ్స్ కొందరికి ఇలా హగ్ ఇస్తాను అంటూ సామ్రాట్ పై తన లిప్ స్టిక్ ని పూసింది. దీప్తి సునైనా లిప్ స్టిక్ రాస్తే రాయించుకుంటారు.. నేను రాస్తే మాత్రం తప్పించుకుంటారా ఏంటి అంటూ సామ్రాట్ షర్ట్ కి లిప్ స్టిక్ పూసింది.మరి వీరి వ్యవహరం ఎంత దూరం వెళ్లుతుందో చూడాలి.