బిగ్బాస్ రెండో సీజన్లో గురువారం జరిగిన 82వ ఎపాసోడ్లో కూడా మర్డర్ మిస్టరీ టాస్క్ నడించింది.ఈ టాస్క్లో గణేష్ మర్డర్ మిస్టరీని పసిగట్టే డిటెక్టివ్ పాత్రలో, రోల్ రైడా మర్డర్ మిస్టరీని ఛేదించే పోలీస్ ఆఫీసర్గా.. గీతా మాధురి హంతకురాలిగా.. మిగిలిన సభ్యులు పబ్లిక్గా వ్యవహరించారు.బిగ్బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసింది గీతా మాధురి.దీంతో ఆమె ఒక వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది,ఇక ఆమెకు ఇచ్చిన స్పెషల్ పవర్ ద్వారా ఈ సీజన్ మొత్తం కౌశల్ను ఎలిమినేషన్కు నామినేట్ చేసింది గీతా.ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని అందరు ఊహించికుంటున్నారు.
ఈ వారం ఎలిమినేషన్లో కౌశల్తో పాటు అమీత్,గణేష్,సామ్రాట్,నూతన్ నాయుడులు నామినేట్ అయ్యారు.ఇక వారం బిగ్బాస్ హౌస్ నుంచి గణేష్ బయటికి వెళ్తాడని అందరు భావిస్తున్నారు.తాజాగా శుక్రవారం జరిగే ఎపిసోడ్ ప్రోమోని విడుదల చేశారు బిగ్బాస్ టీం.శుక్రవారం జరిగే ఎపిసోడ్లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. నూతన్ నాయుడు,తనీష్,రోల్ రైడాలు కెప్టెన్సీ టాస్క్లో పోటీ పడుతున్నారు. వీరి ముగ్గురికి తలో సైకిల్ ఇచ్చి తొక్కామన్నారు బిగ్బాస్.ఈ టాస్క్లో విజయం సాధించిన వారు, ఈ వారం బిగ్బాస్ హౌస్కి కెప్టెన్గా వ్యవహరిస్తారు.అయితే నూతన్ నాయుడు సైకిల్ తొక్కుతుండగా మధ్యలోనే ఆగిపోయింది.దీంతో ఏం జరిగిందో చూడటానికి నూతన్ నాయుడు దగ్గరికి వెళ్లారు.
కౌశల్,నూతన్ నాయుడు దగ్గరికి వెళ్లాడాన్ని తప్పు పట్టింది దీప్తి.కౌశల్ మీరు అలా చేయడం కరెక్ట్ కాదని కౌశల్ను వారించింది.నేను ఏం జరిగిందో చూడటానికి వెళ్తునని అంతే కాని,నేను ఏం సైకిల్ను పట్టుకుని రిపేర్ చేయడం లేదంటు దీప్తికి సమాధానం ఇచ్చాడు కౌశల్.నూతన్ నాయుడికి సామ్రాట్కు మధ్య చినపాటి గొడవ జరిగినట్లు ఈ ప్రోమోలో చూపించారు.ఇక ప్రోమోని బట్టి చూస్తే ఈ రోజు ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.చూద్దాం ఏదైనా జరగొచ్చు.