బిగ్బాస్ మొదటి సీజన్తో పోలిస్తే రెండో సీజన్ పెద్దగా ఆకట్టుకోవడం లేదని చాలామంది అభిప్రాయం.మొదటి సీజన్ ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా నడించింది.దానికి భిన్నంగా రెండో సీజన్ సాగుతుంది.ఇక హోస్మెట్స్ అందరు కలిసి మొదటి నుండి కౌశల్ను ఒంటరి చేస్తున్న సంగతి తెలిసిందే.దీని కారణంగానే అతనికి సోషల్ మీడియాలో భారీ ఎత్తున మద్దతు లభిస్తుంది.ఇక నిన్న (గురువారం)జరిగిన ఎపిసోడ్లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. కంటెస్టెంట్లకు రకరాకాల టాస్క్ లను ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు బిగ్ బాస్. గురువారం ఎపిసోడ్ లో అంతిమయుద్ధం విజేతలుగా పురుషులు నిలిచారు.
మహిళల దగ్గర కౌశల్ కాయిన్స్ దొంగతనం చేశాడంటూ కౌశల్ పై అందరూ మండిపడిన సంగతి తెలిసిందే. కౌశల్ అమ్మాయిల బాత్రూంలను వినియోగిస్తున్నాడంటూ పూజా.. గీతామాధురి వద్ద కంప్లైంట్ చేసింది. ‘హౌస్ లో ఇన్ని బాత్ రూంలు ఉన్నా.. కౌశల్ మాత్రం మహిళల బాత్ రూంలే వాడుతున్నారు. పురుషులకు సెపరేట్ గా మహిళలకు సెపరేట్ గా బాత్ రూంలు ఉన్నా అతడు లేడీ వాష్ రూంలను వాడటం ఏంటి..? ఇది నాకు నచ్చట్లేదు’ అంటూ గీతా వద్ద చెప్పింది.ఇది మొదటిసారి కాదని గతంలో తేజస్విని కూడా ఇదే కంప్లైంట్ చేసిందని చెప్పిన గీతా.. కౌశల్ ని అడిగే ప్రయత్నం చేసింది. దానికి కౌశల్ నుండి సరైన సమాధానం రాలేదు. మరి ఈ వ్యవహారంపై నాని ఎలా స్పందిస్తాడో చూడాలి.