బిగ్బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు నాకు పీఎం నుంచి ఫోన్ వచ్చిందని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…బిగ్బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులను సొంతం చేసుకున్నాడు కౌశల్.ఇప్పటివరకు ఏ టీవీ రియాలిటీ షోలోని ఎవరికీ రానన్ని ఓట్లు కౌశల్కు వచ్చాయి.కౌశల్ బిగ్బాస్ విన్నర్ అయిన తరువాత ప్రధానమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చిందని చెప్పి షాక్ ఇచ్చాడు. కౌశల్ బిగ్బాస్విజేతగా నిలిచిన తరువాత అతడికి కంగ్రాట్స్ చెబుతూ పీఎమ్ ఆఫీస్ నుండి ఓ వ్యక్తి ఫోన్ చేశారట.కౌశల్ షూటింగ్ లో ఉండడంతో అతడు తండ్రి ఫోన్ తీసి మాట్లాడినట్లు వెల్లడించాడు.
ఇప్పటికే అతడికి డాక్టరేట్ అవార్డుతో పాటు, అతడి పేరుని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు చేయబోతున్నారని తెలుస్తోంది. డాక్టరేట్ ఎందుకు ఇస్తున్నారనే విషయాలపై కౌశల్ త్వరలోనే స్పందిస్తానన్నారు.ఏ రియాలిటీ షోలో కూడా ఎవరికీ రానన్ని ఓట్లు తనకి రావాడంతో గిన్నీస్ బుక్ నిర్వాహకుల నుండి తనకి కాల్ వచ్చిందని కౌశల్ అన్నారు. బిగ్బాస్ తరువాత కౌశల్ క్రేజ్ అమాంతం పెరిగిందనే చెప్పాలి.కౌశల్ ఎక్కడికి వెళ్లిన అక్కడ అభిమానులు ఆయన ఎదురు చూడటం విశేషం.మరి ఇప్పటికి కూడా కౌశల్ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న హౌస్మెట్స్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.