బిగ్బాస్ మొదటి సీజన్తో పోలిస్తే రెండో సీజన్ మూవీ ప్రమోషన్స్కు బాగా ఉపయోగపడింది.బిగ్బాస్ రెండో సీజన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి రెండు వారాలకి ఓ సారి ఏదో ఒక సినిమా టీం బిగ్బాస్ హౌస్లోకి వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేసుకుని వెళ్తున్నారు.తాజాగా మరో మూవీ టీం బిగ్బాస్ హౌస్లో సందడి చేసింది.సమ్మోహనం హిట్తో మంచి జోష్లో ఉన్న హీరో సుధీర్ బాబు,నిర్మాతగా మారి నన్ను దోచుకుందువటే సినిమాను నిర్మించాడు.గత శక్రవారం విడుదల అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.తాజాగా సినిమా హీరో సుధీర్ బాబు,హీరోయిన్ నాభా నటేశ్ బిగ్బాస్ హౌస్లో సందడి చేశారు.
సుధీర్ బాబు హౌస్లో ఎంట్రీ ఇవ్వగానే మొదటి కౌశల్ ఆనందంతో సుధీర్ని హగ్ చేసుకున్నారు.హౌస్మెట్స్ అందరితో కలివిడిగా మాట్లాడిన సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమా విషయాలను అందరితో షేర్ చేసుకున్నాడు.కాసేపు ఇంటి సభ్యులతో మాట్లాడిన సుధీర్ బాబు బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేశారు.ఇక బిగ్బాస్ రెండో సీజన్ తుది దశకు చేరుకుంది.ఆదివారం రోల్ రైడా ఎలిమినేషన్ అవడంతో హౌస్లో ఐదుగురు మాత్రమే మిగిలారు.కౌశల్,తనీష్,గీతా మాధురి,సామ్రాట్,దీప్తిలు ఫైనల్స్కు చేరుకున్నట్లు నాని ప్రకటించాడు.మరి వీరిలో ఎవరు బిగ్బాస్ రెండో సీజన్ విన్నర్ అవుతారో చూడాలి.