బిగ్బాస్ రెండో సీజన్లో శుక్రవారం జరిగిన 90వ ఎపిసోడ్లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఎపిసోడ్లో కూడా టిక్కెట్ టు ఫినాలే’ టాస్క్ నడిచింది.ఐదుగురు కంటెస్టెంట్ 24 గంటలు పాటు ఆ కారు నుండి కాలు కింద పెట్టకుండా కూర్చోవాలని ఫైనల్గా ఆ ఐదుగురిలో ఎవరైతే కిందకి దిగకుండా ఉంటారో వాళ్ళకు ‘టిక్కెట్ టు ఫినాలే’ లభిస్తుందని బిగ్బాస్ తెలపడంతో హౌస్మెట్స్ తమలోని గేమ్ మొత్తన్ని బయటికి తీసా ఈ కారు టాస్క్ని ఆడారు. కనీసం బాత్ రూంకి కూడా పోకుండా కార్లో తింటూ ఇరుకు కారులో కూర్చుడటం అనేది అంత చిన్న విషయం కాదు. అయితే ఐదుగురు కూడా టిక్కెట్ టు ఫినాలే టాస్క్లో వెనక్కితగ్గలేదు. ఈ కారు టాస్క్ మొత్తనికి సంచాలకుడిగా వ్యవహరించాడు కౌశల్. బయట వర్షం పడుతుండటంతో చలి పెడుతుంది దుప్పటి ఇవ్వాలని దీప్తి రిక్వెస్ట్ చేసినా.. రూల్స్ ప్రకారం ఇవ్వకూడదని.. నేను కూడా మీతో పాటు చలిలోనే పడుకున్నానంటూ కుండబద్దలు కొట్టేశాడు కౌశల్.
ఇక కారులో నిద్ర పోతున్న గీతా మాధురిని మొదట కారులోంచి దింపేశాడు కౌశల్. గీతా దిగిపోవడంతో కారులో తనీష్, దీప్తి, సామ్రాట్, శ్యామలలు మిగిలారు. కొంత సమయం తరువాత తనీష్ దీప్తిని కారులోంచి బయటికి నెట్టే ప్రయత్రం చేశాడు.సామ్రాట్ కూడా శ్యామలను కారు నుంచి దింపే ప్రయత్నం చేశాడు. అయితే శ్యామల, దీప్తిలు ధీటుగా ఎదుర్కోవడంతో కారులోనే ఉండిపోయారు. ఈ తోపులాటలో తనీష్.. దీప్తి జుట్టు, చేయి నేలను తాకడంతో ఆమె కారు దిగాలని తనీష్ వాదించాడు. దీనికి సంచాలకుడిగా ఉన్న కౌశల్.. బిగ్ బాస్ కాలు మాత్రమే కింద పెట్టాలన్నారని చేయి తగిలితే పరిగణలోకి తీసుకోబడదన్నారు. దీనిపై బిగ్ బాస్ కల్పించుకునే కౌశల్ చెప్పినదాన్నే ఫైనల్ చేశారు. ఇక ఈ గేమ్ చివరిదశకు చేరుకోవడంతో సామ్రాట్ బాత్రూమ్ అర్జంట్ కావడం వల్ల కారు నుండి దిగిపోయారు. అనంతరం బజర్ మోగడంతో అప్పటికి కారులో దీప్తి, శ్యామల, తనీష్లు ఉండటంతో గేమ్ రూల్ ప్రకారం ఎవరూ ‘టిక్కెట్ టు ఫినాలే’లో విజేత కాలేకపోయారు.