Saturday, May 4, 2024
- Advertisement -

తెలుగు కన్నా కోలీవుడ్ బాగుంది అంటున్న తెలుగు అమ్మాయి…

- Advertisement -

ఆవకాయ్ బిర్యానీ సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో కి అడుగు పెట్టిన నటి బిందు మాధవి. ఈ సినిమా బిందు కి చాలా బాగా హెల్ప్ అయింది అని చెప్పొచ్చు. కానీ ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన తెలుగు లో ఆశించిన స్థాయి లో గుర్తింపు రాలేదు ఈ భామకి. ప్రస్తుతం బిందు తమిళం లో బిజీ ఆర్టిస్ట్ అయిపొయింది.

“తెలుగు సినిమా పరిశ్రమ కి తమిళ సినిమా పరిశ్రమ కి కంపేర్ చేసి చూస్తే నా వరకు నాకు కోలీవుడ్ బాగుంది అని అనిపిస్తుంది. ఇక్కడ దర్శకులు, నిర్మాతలు నన్ను బాగా ప్రోత్సాహిస్తున్నారు. నాకు కోలీవుడ్ లో చాలా అవకాశాలు వస్తున్నాయి.” అని బిందు చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం తన తదుపరి తమిళ చిత్రం కి సంబందించిన షూటింగ్ లో బిందు బిజీ గా ఉంది. ఈ సినిమా లో ఒక గ్రామీణ అమ్మాయి గా బిందు కనిపించనుంది. ఆడియన్స్ తన పాత్ర ని బాగా ఇష్టపడతారు అనే నమ్మకం తో ఉంది ఈ హీరోయిన్.

ఇకపోతే తమిళ సినిమాలు చేస్తున్నందున తమిళం బాగా నేర్చుకున్నారా అని ఆవిడని అడిగితే, “తమిళం అనర్గళం గా మాట్లాడగలుగుతున్నాను కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు మాత్రం కొంచెం కష్టం అవుతుంది.” అని సెలవిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -