Saturday, May 4, 2024
- Advertisement -

విడిపోతున్న మ‌రో బాలీవుడ్ జంట‌…

- Advertisement -

బాలీవుడ్‌‌లో మరో జంట విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇరవై ఏళ్ల తమ వైవాహిక బంధానికి నటుడు అర్జున్ రాంపాల్-మెహర్ జెస్సియాలు స్వప్తి చెప్పారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు వారు ప్రకటించారు. విడాకులు తీసుకోవడమనేది ఇద్దరికీ కఠిన నిర్ణయమే అయినా, విడిపోక తప్పలేదని రాంపాల్ దంపతలు పేర్కొన్నారు.

20 ఏళ్ల అందమైన ప్రయాణం తర్వాత పరస్పర అంగీకారంతో మేం విడిపోవాలనుకుంటున్నాం. వీటి వెనుక కారణాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. వేర్వేరు దారుల్లో వెళ్దామనుకుంటున్నాం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నప్పటికీ మాకు కావాల్సిన వాళ్ల కోసం మా మధ్య బంధం కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

అర్జున్-మెహర్ దంపతులకు మహీకా (16), మైరా (13) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరి మధ్య ఇప్పటి వరకు కొనసాగిన అన్ని సంబంధాలు ఇక ముగిసినట్టేనని, ఇంతకుమించి మరేమీ మాట్లాడబోనని అర్జున్ రాంపాల్ వ్యాఖ్యానించాడు.

1997లో మోడలింగ్‌లోకి ప్రవేశించిన అర్జున్ రాంపాల్ తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. అనంతరం 2001లో ప్యార్‌ ఇష్క ఔర్ మొహాబత్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. ఇక రాంపాల్- మెహర్‌ల వివాహం 1998లో జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -