Sunday, May 5, 2024
- Advertisement -

నెటిజన్ ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చిన నటి తాప్సి

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలోకి మంచు మనోజ్ నటించిన ఝమ్మందినాధం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయిన తాప్సి తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఈ అమ్మడికి తెలుగు లో పెద్దగా సక్సెస్ లు రాలేదు. బాలీవుడ్ లో పింక్ సూపర్ హిట్ అయ్యాక వరుస విజయాలు అందుకొని బిజీ హీరోయిన్ గా మారింది. సోషల్ మాద్యమాల్లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే తాప్సీ తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధాన ఇచ్చింది.

ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేసే బదులు ఖరీదైన నీ కారు ఇస్తే బాధితులకు ఏదో ఒకరకంగా ఉపయోగపడుతుంది కదా.. అన్న నెటిజన్ ప్రశ్నకు తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఆక్సిజన్, బెడ్లు దొరక్క కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో తన వంతు కృషిగా ఆక్సిజన్ సిలిండర్లతోపాటు అవసరమైన మందులు ఎవరి వద్ద లభ్యమవుతాయన్న వివరాలను పోస్టు చేస్తున్నారు. ఈ పోస్టు చూసి ఓ నెటిజన్ ఇలా ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేయకపోతే ఖరీదైన నీ కారును వాళ్లకు అందిస్తే ఏదో రకంగా ఉపయోగించుకుంటారు కదా అని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన తాప్సి ఇలాంటి చెత్త మెసేజ్‌లతో తన సమయాన్ని వృథా చేయవద్దని కోరింది. ఒకవేళ మీలాంటి వాళ్లు ఇదే చెప్పాలనుకుంటే దేశం మళ్లీ సాధారణంగా ఊపిరి పీల్చుకునే వరకు నోరు విప్పొద్దని సూచించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -