జుమ్మంది నాదం అనే సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమ లో అడుగు పెట్టి ఆ పై అంచలంచెలుగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ బాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం పరుచుకుంది తాప్సీ పన్ను. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తాప్సి అపుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. గతంలో ఒకసారి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పై ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు తాప్సీ తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
Also Read: శరవేగంగా “ఎన్టీఆర్ 30” షూటింగ్
తాజాగా ఇప్పుడు మరొక సారి అలాంటి కామెంట్లతో ముందుకు వచ్చింది తాప్సి. తనకు సౌత్ సినిమాల ద్వారా గుర్తింపు వచ్చినప్పటికీ… ఒక నటిగా మాత్రం సౌత్ లో తృప్తి లభించలేదని చెప్పింది. సౌత్ సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించింది. సౌత్ లో సంతృప్తి లేకపోవడం వల్లే తాను బాలీవుడ్ పై దృష్టిసారించానని తెలిపింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సౌత్ సినీ ప్రేక్షకులు మండిపడుతున్నారు.
Also Read: త్వరలోనే సుడిగాలి సుధీర్ పెళ్లి .. అమ్మాయి ఎవరంటే..?