ఒకప్పుడు బ్రహ్మానందం లేని సినిమాలు విడుదలయ్యేవి. కావు ఆయన ఉంటే సినిమా హిట్ అనే టాక్ ఉంది. ఇప్పుడు అవన్నీ పోయి అసలు బ్రహ్మానందం కోసం సినిమాలో ఎక్కడున్నాడో వెతుక్కోవాల్సిన పరిస్థితి. అలా ఉన్న పరిస్థితుల్లో అతడికి పవర్ఫుల్ పాత్ర దక్కింది. మంచు విష్ణు సినిమాకు లీడ్ రోల్లో బ్రహ్మానందం చేస్తున్నారు. ‘ఆచారి అమెరికా యాత్ర’ సినిమా ప్రస్తుతం షూటింగ్ అవుతోంది. ఈ సినిమా చేస్తున్న సమయంలోనే బాలకృష్ణ నటిస్తున్న ‘జై సింహా’ సినిమాకు అవకాశం వచ్చింది.
వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకొని బ్రహ్మానందం నటించి కామెడీ పండించాడు. కానీ ఆ ఆనందం ఎంతసేపో నిలవలేదు. ఆ అవకాశం ఆయనకంత సంతోషమేమీ మిగల్చలేదని సమాచారం.
‘జై సింహా’ సినిమాలో రచయిత రత్నం బ్రాహ్మానందం కోసం ఒక లెంగ్తీ కామెడీ ట్రాక్ రాశాడు. బాలయ్యతో బ్రహ్మి కామెడీ సీన్లను దర్శకుడు కె.ఎస్.రవికుమార్ షూటింగ్ పూర్తి చేశాడు. ఐతే ఈ కామెడీ సీన్లు ఫైనల్ ఎడిటింగ్లో లేచిపోయినట్లు చిత్ర బృందం చెబుతున్న ముచ్చట. సినిమా నిడివి ఎక్కువైపోవడంతో బ్రహ్మానందం కామెడీ సీన్లపై కత్తి పడిందట.