హాస్యనటుడు బ్రహ్మానందం తెర మీద కనిపించి చాలా కాలమే అయ్యింది.మునపటి ఫాం కోసం చేస్తున్న ప్రయత్రాలు ఏవీ సక్సెస్ కావడం లేదు.తాజగా మంచు విష్ణు హీరోగా ఆచారి అమెరికా యాత్ర సినిమాలో మంచి కమెడి బ్రహ్మ పండిచాడని టాక్. కాని సినిమా విడుదల వాయిదాల మీద వాయిదాలు వేస్తు గత శుక్రవారం విడుదలైంది.ఇక బ్రహ్మానందం ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ఆయనతో మాట్లాడించడానికి మీడియా ప్రయత్నించగా అందుకు ఒప్పుకోలేదు.
బ్రహ్మానందం నడుచుకుంటూ వెళుతుండగా విలేకరులు ఫొటోలు, వీడియోలు తీయడం కోసం ఆయన వైపునకు కెమెరాలు పెట్టి వెనక్కి నడూస్తూ వెళ్లారు. వారిని ఉద్దేశించి బ్రహ్మానందం జోకులు వేశాడు. ‘కొన్నాళ్లకు మీకు ఇలా వెనక్కు వెనక్కు నడవడమే అలవాటైపోతుంది..’ అని బ్రహ్మీ చమత్కరించాడు. కొంతమంది మీడియా సభ్యులు పవన్ కల్యాణ్,శ్రీ రెడ్డి. ప్రస్తావన తీసుకురాగా దానిపై బ్రహ్మానందం రియాక్ట్ కాలేదు. అక్కడ నుంచి బ్రహ్మానందం వడివడిగా వెళ్లిపోయారు.