Wednesday, May 8, 2024
- Advertisement -

క‌మ‌ల్ విశ్వ‌రూపం-2పై కేసు

- Advertisement -

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విశ్వ‌రూపం – 2 సినిమాపై కేసు న‌మోదైనట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.. ఆగస్టు 10న సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. అయితే ఇప్పడు ఈ సినిమా విడుదలపై నిషేధం కోరుతూ సాయిమీరా చిత్ర నిర్మాణ సంస్థ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

క‌మ‌ల్ ‘మర్మయోగి’ అనే సినిమా చేయడానికి త‌మ బ్యాన‌ర్‌లో ఒప్పందం కుదుర్చుకొని చిత్రనిర్మాణానికి రూ.6.90 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని, కమల్ హాసన్ కు అడ్వాన్స్ గా రూ.4 కోట్లు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో తమ డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.తమ డబ్బు చెల్లించే వరకు సినిమాను విడుదల చేయకుండా నిషేధం విధించాలని కోరారు.దీంతో కోర్టు కమల్‌కు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -