ఈ మధ్య తెలుగు సినిమాలు తమ పంథాను మార్చుకున్నాయి. తెలుగు సినిమాలలో ఈ మధ్య బుతు కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కువైయ్యాయి. ఇటీవల ఇటవంటి సినిమాలు ఎక్కువుగా వస్తున్నాయి. అర్జున్ రెడ్డితో మొదలైన ట్రెండ్ ఆర్ఎక్స్ 100తో పీక్స్ చేరింది. అయితే ఈ సినిమాలలో కంటెంట్ కూడా బలంగా ఉండటంతో ఆ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. తాజాగా ఇలాంటి చిత్ర మరోకటి ప్రేక్షకులు ముందు రావడానికి రెడీ అవుతోంది. చీకటి గదిలో చితకొట్టుడు అనే సినిమా యూత్ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. వినడానికే టైటిల్ అదో రకంగా ఉంది. గతంలో విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు ఘాటుగా కనిపించే సీన్లతో చీకటి గదిలో చితకొట్టుడు అనే సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ను చూస్తుంటే అర్థం అవుతోంది. ట్రైలర్ మొత్తం బుతులు,డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేసి తమ సినిమా ఎలాంటి సినిమానో ముందే చెప్పేశాడు దర్శకుడు. సంతోష్ పి జయకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆదిత్ – నిక్కీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ బుతు సినిమాలో పోసాని కృష్ణ మురళి, రఘుబాబు సీనియర్ యాక్టర్స్ కూఆ నటించడం విశేషం. ఇప్పటికి అయితే ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులలో అంచనాలు నెలకొన్నాయి. మరి విడుదల తరువాత ఈ సినిమా ఎన్ని వివాదలతో పాటు సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి. సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- Advertisement -
ఇది బుతు సినిమా కాదు అంతకు మించి…!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -