Saturday, May 4, 2024
- Advertisement -

పునీత్ కోసం రంగంలోకి చిరు, ఎన్టీఆర్

- Advertisement -

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా దూరమైనా.. కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఇంకా నిలిచే ఉన్నాడు. పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ మార్చ్ 17న విడుదలవుతోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను మార్చ్ 6న నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లను చీఫ్ గెస్టులుగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనికి వీరిద్దరూ ఓకే చెప్పారని సమాచారం.

అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.పునీత్ రాజ్ కుమార్ తో చిరంజీవి, తారక్ కు మంచి అనుబంధం ఉందనే విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -