Sunday, April 28, 2024
- Advertisement -

సై రా కి ఇంకా పదును పెడుతున్నారు

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర లో నటించిన చిత్రం సై రా నరసింహ రెడ్డి. ఈ సినిమా లో చాలా మంది గొప్ప నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనుల్లో బిజీ గా ఉంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం ఎడిటింగ్ స్టేజ్ లో ఉంది. సినిమా డైరెక్టర్ మరియు ఎడిటర్ కూర్చొని ఏది అవసరం, ఏది అనవసరం అని డిస్కస్ చేసుకొని, అవసరం లేని సీన్లని ఎడిట్ చేస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. అయితే ఏది కావలి, ఏది వద్దు అని నిర్ణయించుకొని సినిమా నిడివి ని ఎంత కుదిరితే అంత కుదించాలి అని చిత్ర యూనిట్ భావిస్తుంది.

అయితే ఈ సినిమా కోసం అందరూ ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా నిడివి విషయం లో చిరంజీవి కూడా పాల్గొంటున్నారట. ఈ సినిమా నిడివి చాలా తక్కువ ఉండాలి అని, బాలీవుడ్ లో కూడా సినిమా విడుదల అవుతుంది అనే ఉదేశ్యం తో వాళ్లకి కూడా సినిమా నచ్చాలి అనే ఉదేశ్యం తో ఔట్పుట్ ఉండాలి అని భావిస్తున్నారట.

ఈ సినిమా కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ ఈ సినిమా ని కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ నుండి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2 న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -