Thursday, May 9, 2024
- Advertisement -

నిర్మాత‌లంద‌రు క‌లిసి మ‌హేశ్ సినిమాను ఏదో చేసేలా ఉన్నారే?

- Advertisement -

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ బాబు ప్ర‌స్తుతం త‌న 25వ సినిమా మ‌హ‌ర్షి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాకు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఈ సినిమాను ముగ్గురు నిర్మాత‌లు నిర్మిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ ఈ ముగ్గురు నిర్మాత‌లు నిర్మిస్తున్నారు. ఒక ప్రాజెక్ట్ కి ముగ్గురు నిర్మాతలు కావడంతో ఒకరితో మరొకరికి ఈగో సమస్యలు వస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు ఎక్కువగా తన అథారిటీ చూపించడం మిగిలిన ఇద్దరు నిర్మాతలకు నచ్చడం లేదట.

మంచి డీల్స్ ఏమైనా వస్తే బిజినెస్ క్లోజ్ చేయాలని దిల్ రాజు చూస్తుంటే తమ మధ్య ఉన్న ఈగో సమస్యలతో ఆ డీల్ క్లోజ్ అవ్వకుండా చూస్తున్నారట మిగిలిన ఇద్దరు. దిల్ రాజుకి ఎంత న‌చ్చ చెబుతున్న విన‌డం లేద‌ని స‌మాచారం. మరోపక్క సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతుందని టాక్. ఇలా వారిలో వారు గొడ‌వ ప‌డి సినిమాను ఏం చేస్తార‌నే భ‌యంలో ఉన్నారు మ‌హేశ్ అభిమానులు. ఇక ఈ సినిమాలో మ‌హేశ్ బాబు స‌ర‌స‌న పూజా హెగ్డె న‌టిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -