సోషల్ మీడియాలో యాంకర్ అనసూయ ఔట్
వివాదాలు, విమర్శలు, కామెంట్లు, పుకార్లు ఇలా ఎన్నెన్నో వాటిని సహించి.. భరించిన ఆమె చివరికి విసిగి వేసారి సామాజిక మాధ్యమాల నుంచి వైదొలిగింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నీ మీడియాల నుంచి బయటకు వచ్చేసింది. తన ఖాతాలన్నింటినీ బ్లాక్ చేసేసుకుంది. ఆమె ఎవరో కాదు నటి, బుల్లితెర యాంకర్ అనసూయ.
ఇటీవల ఆమెపై ఎన్నో పుకార్లు, వివాదాలు రేగాయి. మొన్ననే ఓ చిన్నారి ఫోన్ పగలగొట్టిందని సోషల్ మీడియాలో అందరూ రెచ్చిపోయి ఆమెను తిట్టేశారు. వివరణ ఇచ్చినా వాళ్లు శాంతించలేదు. దీంతో సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నుంచి వెళ్లిపోయింది. అన్ని అకౌంట్లు డిలీట్ చేసేసుకుంది. చిన్నారి ఫోన్ పగలగొట్టిన విషయమై అనసూయపై పెద్ద ఎత్తున చర్చ జరగడంతో నెటిజన్లు విపరీతంగా స్పందించారు. నెగెటివ్ కామెంట్స్ రావడంతో ఆమె ఎంత చెప్పినా వినలేదు. మళ్లీ విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా లక్ష్యం చేయడంతో సోషల్ మీడియా నుంచి వైదొలిగింది. ఆమె సోషల్ మీడియా ఖాతాలన్నింటా `సారీ.. దిస్ అకౌంట్ డజ్ నాట్ ఎగ్జిట్` అని చూపిస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఆమె ఖాతాలన్నింటికీ ఇదే మెసేజ్ వస్తోంది.