Monday, May 13, 2024
- Advertisement -

అఖిల్ కు కార్పొరేట్ భజన

- Advertisement -

అ్రగ కధానాయకుల వారసులు ఎంట్రీ ఇచ్చే టైమ్లో హడావిడి ఎక్కువగా ఉంటుంది.ఇక నాగార్జున లాంటి ఓ టాప్ హీరో కుమారుడు ఎంట్రీ అంటే ఇక మాములుగా ఉంటుందా చెప్పండి.

అఖిల్ విషయంలో అదే జరిగింది.ఇప్పటికే సిసింద్రీతో చిన్న వయస్సులోను,మనం క్లైమాక్స్ తో రీసెంట్ గా ఇరగదీసిన అఖిల్ బాబు…. తన తాజా చిత్రం అఖిల్ మ్యాటర్లో భారీ లెవెల్లో సోలో హీరోగా  ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీనికోసమని అఖిల్ ఆడియో లాంచ్ ను గచ్చిబౌలి స్టేడియమ్ లో ఓ రేంజ్ లో చేసేసారు. దీనికి సినిమా వాళ్లు ఎలా ఉన్నా…కార్పొరేట్ శక్తులు హాజరవ్వడం ట్రేడ్ లో పెద్ద చర్చే జరిగేలా చేసింది.

పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి. పొట్లూరి నుంచి మాట్రిక్స్ మాజీ అధినేత ప్రసాద్ ,అలాగే మరో కార్పొరేట్ దిగ్గజం రఘురామ కృష్ణం రాజుతో పాటు హేమా హేమీలకు పనులు చక్కబెట్టే చాముండి వరకు ఆడియో ఈవెంట్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.వారంతా అఖిల్ బాబుకు పని గట్టుకుని మరీ భజన చేశారు. వారి స్థాయికి ఇలా అఖిల్ ను మోయాల్సిన అవసరం లేదు.కేవలం నాగ్ తో ఉన్న పర్సనల్ అటాచ్ మెంట్ తో ఇలా చేయాల్సి వచ్చింది.

ఏది ఏమైనా…అఖిల్ కు జరిగిన కార్పొరేట్ భజన పై ఇటు టాలీవుడ్ లోనే కాకుండా అటు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోను చర్చ సాగుతూ ఉండడం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -