Saturday, April 27, 2024
- Advertisement -

ఫోటో వైరల్: ఆర్ఆర్ఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసిన వార్నర్‌…!

- Advertisement -

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఆర్ఆర్ఆర్” చిత్రం నుంచి తాజాగా ఒక పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేశారు. పోస్టర్ లో తారక్ బండి నడుపుతుండగా రామ్ చరణ్ వెనక కూర్చున్నారు. ఈ ఫోటో షేర్ చేసిన కొంత సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది మెగా, నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. ఇక ఈ ఫోటో చూసిన క్రికెట్ దిగ్గజం ఆసీస్ క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న డేవిడ్‌ వార్నర్‌ కూడా తనదైన శైలిలో స్పందించారు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ, రచ్చ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే వార్నర్ “ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం విడుదల చేసిన ఈ ఫోటోను తనదైన శైలిలో మార్ఫింగ్ చేసి మరోసారి అభిమానులను సందడి చేశారు. వార్నర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఫోటోలో తారక్ తలకి బదులుగా తన సహచరుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ తలను జోడించాడు. అదేవిధంగా రామ్ చరణ్ తలకు బదులుగా తన తలను అమర్చాడు.ఈ విధంగా మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో క్షణాలలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ విధంగా డేవిడ్ వార్నర్ మార్ఫింగ్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఫోటో పై ఎస్ఆర్ఎస్ సహచరుడు రషీద్ ఖాన్ వెంటనే స్పందించి హెల్మెట్ గైస్ అంటూ కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఎన్టీఆర్, రామ్ చరణ్ తలకు హెల్మెట్ పెట్టి ఇప్పుడు సంపూర్ణంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చూసిన “ఆర్ఆర్ఆర్”చిత్ర బృందం ఇది అసంపూర్తిగా ఉంది. ఈ బండికి నెంబర్ ప్లేట్ లేదంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -