Thursday, April 18, 2024
- Advertisement -

అనసూయ పై కామెంట్స్ చేస్తే శిక్ష తప్పదు.!

- Advertisement -

సెలబ్రిటీల పై ఇష్టానుసారంగా కొందరు నెటిజన్లు రకరకల కామెంట్స్ చేస్తూ ఉంటారు. హద్దు దాటి వారి మనోభావాల్ని దెబ్బతీసేలా కూడా కొన్ని కామెంట్స్ ఉంటాయి. అంతేకాకుండా బూతు పదజాలంతో హర్ట్ చేస్తుంటారు. అందుకు సెలబ్రెటీలకు బాగా కోపం కూడా వస్తుంది.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు బూతు బారిన పడడం అటుపై సైబర్ క్రైమ్ ని ఆశ్రయించడం తెలిసిందే. ఇక యాంకర్ అనసూయకు ఈ బాధలు తప్పడం లేదు. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే అనసూయకు నెటిజనుల నుంచి ఘాటైన పదజాలంతో కామెంట్లు ఎదుర్కోక తప్పడం లేదు. అయితే ఈసారి ఓ నెటిజన్ బూతు పదజాలంతో కించపరిచే విధంగా అనసూయను టార్గెట్ చేశాడు. దీంతో అనసూయ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు.

దీనిపై విచారణ చేపటిన పోలీసులు.. కామెంట్లు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అనసూయకు చెప్పారు. సోషల్ మీడియాల్లో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం నేరం. సైబర్ క్రైమ్ చట్టాల ప్రకారం శిక్షార్హం. ఇది తెలిసీ నెటిజనులు చెలరేగిపోతే శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పటికే ఎందరో ఇలాంటి వివాదాల్లో చిక్కుకుని కటకటాల పాలైన సంఘటనలు ఉన్నాయి. అనసూయ మ్యారీడ్ గాళ్. తనపై ఇలా కామెంట్లు గుప్పించిన వారిని శిక్షించి తీరతామని పోలీసులు సీరియస్ గా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -