బిగ్బాస్ రెండో సీజన్ రోజు రోజుకి మరింత రసవత్తరంగా నడుస్తుంది.షోపై మొదట్లో కొంత వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికి వాటిని అధికమించి షో మంచి రేటింగ్స్తో నడుస్తుంది.ఇక సోమవారం జరిగిన ఎపిసోడ్లో ఎలిమినేషన్కు నామినేషన్స్ జరిగాయి.ఈ వారం ఎలిమినేషన్లో కౌశల్,దీప్తి,పూజా రామాచంద్రన్,తనీష్లు నామినేట్ అయ్యారు.ఇక గత వారం రోజులుగా హౌస్లో కాస్తా క్లోజ్గా ఉంటు వస్తున్నారు సామ్రాట్,గీతా మాధురిలు.ఈ అబ్బాయి నాకు క్లోజ్ అయిపోతున్నాడంటూ గీతా.. శ్యామలతో చెప్పింది. రాత్రిపూట సామ్రాట్-గీతాలు మాట్లాడుకోవడం, ఇద్దరూ కలిసి హౌస్ లో అల్లరి చేయడం వంటి విషయాలు కొందరికి సందేహాలు కలిగేలా చేశాయి.
అయితే ఇదే విషయాన్ని దీప్తి నల్లమోతు, శ్యామల కలిసి గీతామాధురికి చెప్పాలనుకున్నారు.దీప్తి గీత మాధురికి సామ్రాట్ విషయం చేప్పేయాగా.. దీనిపై గీతా మాట్లాడుతు…’మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారేమో.. నా లైఫ్ లో నందు ప్లేస్ ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. 70 రోజులు అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కచ్చితంగా క్లోజ్ అవుతారు. నాకు సామ్రాట్, రోల్ మాట్లాడుతుంటే నా స్నేహితులతో ఉన్నట్లుగా అనిపించి వారితో సన్నిహితంగా మెలుగుతున్నాను’ అంటూ వారికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.దీంతో సామ్రాట్,గీతా మాధురిలు మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని తెలిపోయింది.