కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సర్ప్రైజ్ ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన సంగతి తెలిసిందే. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పార్ట్ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది.
ఇక ఈ సినమా ఫస్ట్ గ్లింప్స్ ఇంగ్లీష్ లిరిక్స్ తో గ్లింప్స్ ని నడిపించగా చివరిలో ఎన్టీఆర్ ..ఈ సముద్రం చేపలు కంటే కత్తుల్ని, నెత్తురునే ఎక్కువ చుసుండాది. అందుకేనేమో దీనిని ఎర్ర సముద్రం అన్నారు అంటూ చెప్పిన డైలాగ్ హైలైట్గా నిలిచింది. ఎన్టీఆర్ చాలా వైల్డ్ గా కనిపించారు.
ఈ గ్లింప్స్ విడుదలై 24 గంటలు కాక ముందే ఏకంగా 40 మిలియన్ కి పైగా వ్యూస్ ని క్రాస్ చేసేసింది. ఓవరాల్ గా 1 మిలియన్ లైక్స్ ని క్రాస్ చేసేసింది. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా సైఫ్ అలీఖాన్ విలన్ గా నటించారు.