తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే అందరు ఠక్కున చేప్పే పేరు దేవి శ్రీ ప్రసాద్. తెలుగు, తమిళ భాషలలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలుగుతున్నాడ దేవి శ్రీ ప్రసాద్. ఆల్మోస్ట్ తెలుగు హీరోలందరితో పని చేశాడు దేవి శ్రీ ప్రసాద్. హీరోలందరికి మ్యూజికల్ హిట్లు ఇచ్చిన ఘనత దేవికే దక్కుతుంది. అలాంటి దేవి శ్రీ ప్రసాద్ను తెగ ట్రోల్ చేస్తున్నారు అభిమానులు. అదేంటి దేవిని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అనే కదా అనుమానం.
పూర్తి వివరాల్లోరి వెళ్తే… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం మహర్షి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి మొదటి పాటను నిన్ననే(శుక్రవారం) విడుదల చేశారు. చోటి చోటి బాతే అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ పాటను దేవినే అలపించాడు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. ఈ పాటకు దేవి గొంతు సెట్ కాలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హుషారైన బీటున్న పాటలకు దేవి గొంతు బాగుంటుంది కాని స్నేహం మీద కంపోజ్ చేసిన ఇలాంటి స్వీట్ మెలోడీస్కి దేవి గొంతు సింక్ అవ్వలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
సూపర్ హిట్ అవ్వాల్సిన పాట దేవి వల్ల యావరేజ్గా నిలిచిందని అభిమానులు నిరాశ చెందుతున్నారు. దీంతో అభిమానులు దేవిని తెగ ట్రోల్ చేస్తున్నారు ఇండస్ట్రీలో సింగర్ కొరత ఏమైన ఉందా..? మొత్తం పాటలను నువ్వే పాడేసేయ్ అంటూ దేవిని తెగ విమర్శిస్తున్నారు. గతంలో కూడా దేవి ఇలాంటి ట్రోల్స్ను ఫేస్ చేశాడు. మంచి సాంగ్ ఏదైన వస్తే అది దేవినే పాడతాడు, వేరే సింగర్కు ఇవ్వడని అపవాదు దేవిపైనా ఉంది. మరి ట్రోల్స్పై దేవి ఎలా స్పందిస్తాడో చూడాలి.
- Advertisement -
దేవి శ్రీ ప్రసాద్ను ట్రోల్ చేస్తున్న అభిమానులు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -