Saturday, April 20, 2024
- Advertisement -

300 కోట్లతో ధనుష్ కొత్త ఇల్లు.. అందుకోసమే..?

- Advertisement -

మల్టీటాలెంటెడ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడై మరింత పాపులారిటీ తెచ్చుకున్న ధనుష్..తన భార్య ఐశ్వర్యతో తన 18 వివాహ బంధానికి ముగింపు పలికినట్లు ఇటీవల పేర్కొన్నాడు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ తమ ఇద్దరు పిల్లలతో కలిసి జీవితాన్ని గడిపిన ఆ ఇంట్లో ఉండదల్చుకోలేదో ఏమో ప్రస్తుతానికి ధనుష్ హోటల్లోనే బస చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో ధనుష్ చెన్నైలో ఓ విలాసవంతమైన ఇంటి నిర్మాణం చేపట్టనున్నాడని వార్తలు వస్తున్నాయి. అతడు ఆ ఇంటి కోసం ఏకంగా రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నాడట. అత్యాధునిక సౌకర్యాలు, హంగులు, ఆర్బాటాలతో తన డ్రీమ్ హౌస్ ను నిర్మించుకుంటున్నట్లు తెలుస్తోంది. ధనుష్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు.

తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమాను ధనుష్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు కలిపి రూ.100 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ ఇల్లు నిర్మాణం పూర్తయ్యే నాటికైనా ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలవాలని ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ కు సూపర్ స్టార్ సాయం..

పవన్ కల్యాణ్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఏపీ సర్కార్

మరోసారి సెంటిమెంట్ ఫాలోఅవుతున్న త్రివిక్రమ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -