మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తర్వలో ఓ సినిమా తెరకెక్కబోతోంది.ప్రస్తుతం ఆ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే టాలీవుడ్లో క్రేజ్ మామూలుగా ఉండదు. వీరి కాంబోలో వచ్చినవి రెండు సినిమాలే అయినా.. ఆ రెండు ప్రేక్షకులకు ఎంతో నచ్చినవే. అతడు, ఖలేజాతో తర్వాత దాదాపు 11 ఏళ్ల తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పుడీ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలే ఉన్నాయి.
గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ తన సినిమాలో ఒక సెంటిమెంట్ను ఫాలో అవుతున్నాడు. అదే టాలీవుడ్కు దూరంగా ఉంటున్న సీనియర్ హీరోయిన్స్ను మరోసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడం. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాతో తెలుగులో ఫేడవుట్ అయిపోయిన స్నేహను మళ్లీ టాలీవుడ్కు తీసుకొచ్చాడు త్రివిక్రమ్.
స్నేహ తర్వాత కుష్బూ, నదియా, టబులాంటి వారికి కూడా తన సినిమాలతో టాలీవుడ్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యేలా చేశాడు. ఇప్పుడు మరో సీనియర్ నటి శోభనను రంగంలోకి దించనున్నాడు. ఈ సినిమాలో మహేశ్కు పిన్నిగా శోభన నటించనుందని టాక్ వినిపిస్తోంది.
ఏపీలో పొగబెడుతున్నారు.. తెలంగాణలో రా..రమ్మంటున్నారు.