Thursday, April 25, 2024
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ కు సూపర్ స్టార్ సాయం..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ వచ్చే నెల 11న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి తాజా అప్ డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. రాధేశ్యామ్’తెలుగు వెర్షన్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారట. ఆ మేరకు ప్రభాస్ మహేశ్ ను సాయం కోరాడట. తెలుగులో మహేశ్ వాయిస్ ఇస్తే సినిమాకి మరింత హైపు క్రియేట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది. అందుకే మహేశ్ ను సంప్రదించినట్లు సమాచారం. ప్రభాస్ కోసం మహేశ్ రాధేశ్యామ్ చిత్రానికి నెరేటర్ గా మారతానని ప్రామిస్ చేశాడట.

అయితే ఇది ఎంత వరకు నిజం అనే విషయం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. మహేశ్ బాబు గతంలో పవన్ కళ్యాణ్ ‘జల్సా’ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో ఉన్న అనుబంధం కారణంగా మహేశ్ ఆ చిత్రానికి వాయిస్ ఇచ్చాడు. అది సినిమాకే ప్లస్ అయింది. త్రివిక్రమ్ చమత్కారంగా రాసిన మాటలు మహేశ్ వాయిస్తో థియేటర్స్ లో బాగా పేలాయి. ఇప్పుడు మరోసారి మహేశ్ వాయిస్ రాధేశ్యామ్ చిత్రంలో వినిపించనుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమాకి మహేశ్ బాబు వాయిస్ ఏ స్థాయిలో హైలైట్ అవుతుందో చూడాలి మరి.

పవన్ కల్యాణ్ ను మళ్లీ టార్గెట్ చేసిన ఏపీ సర్కార్

నాని నవ్వుల హోం మొదలైంది

మ‌ళ్లీ కౌబాయ్ గా మహేశ్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -