- Advertisement -
సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి షూటింగ్లో బిజీగా ఉన్నారు.హైదరాబాద్ – రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన విలేజ్ సెట్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో విలన్గా డైలాగ్ కింగ్ సాయికుమార్ కనిపించనున్నట్టు తాజా సమాచారం.వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తుంది.
‘ఎవడు’ సినిమాలో మెయిన్ విలన్ గా సాయికుమార్ అద్భుతంగా నటించాడు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ తో వంశీ పైడిపల్లి .. ఈ సినిమాలోను విలన్ గా సాయికుమార్ నే తీసుకున్నాడట. ఈ సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.