తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా చాలా సినిమాలు చేసినప్పటికి సరైన హిట్లు మాత్రం పడలేదనే చెప్పాలి.ఈ మధ్యే ఆమెకు మంచి సినిమాలు వస్తున్నాయి.తొలిప్రేమతో డిసెంట్ హిట్ కొట్టిన రాశీ తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టింది.తాజాగా ఆమె హీరోయిన్గా నటించిన సినిమా శ్రీనివాస కల్యాణం.ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకు రెడీ అవుతుంది.ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా రాశీ సినిమా గురించి పలు విషయాలను మీడియాతో పంచుకుంది.నా పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నాకు ఎలాంటి సందేహం కలిగినా.. వెంటనే దర్శకుడిని అడిగి తెలుసుకునేదాన్ని.
అమలాపురంలోని పెళ్లి సన్నివేశాలు తీసే సమయంలో దిల్ రాజు చాలా కఠినంగా వ్యవహరించారు. సెట్ లో ఉన్నప్పుడు నాచేతిలో ఫోన్ ఉండకూడదని ఆయన ముందే చెప్పారు. కానీ నేను ఫోన్ పట్టుకొని ఉన్నానని నా చేతిలో ఫోన్ లాగేసుకొని వార్నింగ్ ఇచ్చారు.ఫోకస్ మొత్తం షూటింగ్ మీదే పెట్టాలని దిల్ రాజు చెప్పారు. డైరెక్టర్ సతీష్ కూడా పాత్రలో ఇన్వాల్వ్ అవ్వమని చెప్పేవారు. వారిద్దరూ పడ్డ కష్టం సినిమా అవుట్ ఫుట్ లో తెలిసింది. ఈ సినిమా తనకు మరో హిట్ ఇస్తుందని రాశీ భావిస్తుంది.